నవతెలంగాణ -హైదరాబాద్ : ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కాళింది కుంజ్ సమీపంలోని దోభీ ఘాట్ వద్ద ఓ పీవీసీ పైప్ తయారీ ఫ్యాక్టరీలో గురువారం ఈ దుర్ఘటన జరిగింది. అగ్నిప్రమాదంతో ఫ్యాక్టరీ నుంచి పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించింది. ఐదు అగ్నిమాపక యంత్రాలను ఘటనా స్ధలానికి అధికారులు రప్పించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు కారణాలు, ప్రాణ, ఆస్తినష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా వెలుగుచూడలేదు. ప్రాధమిక దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడవుతాయని అధికారులు చెబుతున్నారు.