పరశురామ్‌ దర్శకత్వంలో మరో సినిమా

‘గీత గోవిందం’ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్‌ కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాను నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తుండగా, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ గా వాసు వర్మ వ్యవహరించ నున్నారు. ఈ కాంబినేషన్‌ పై ఇప్పటికే అంచనాలు పెరిగాయి.
బుధవారం హైదరాబాద్‌లో ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది. హీరో, హీరోయిన్లు విజరు దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌పై నిర్మాత శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి క్లాప్‌ కొట్టగా, ఫస్ట్‌ షాట్‌ను గోవర్ధన్‌రావు దేవరకొండ డైరెక్ట్‌ చేశారు. ఫైనాన్షియర్‌ సత్తి రంగయ్య కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్‌ త్వరలోనే మొదలు కానుంది. ‘సీతారామం’ సినిమాలోని తన పర్ఫార్మెన్స్‌తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మణాల్‌ ఠాకూర్‌ ఈ సినిమాలో విజరు సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ పై నిర్మితమవుతున్న 54వ చిత్రమిది.

Spread the love