విశాఖ బీచ్‌లో దారుణం…

నవతెలంగాణ- విశాఖ: విశాఖ పట్నంలో నమ్మి వచ్చిన ప్రియురాలిని హత్య చేశాడు ఓ ప్రియుడు. త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్థరాత్రి ఈ దారుణం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయం తెలియగానే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ తరుణంలోనే గాజువాక పోలీస్ స్టేషన్‌లో నిందితుడు లొంగిపోయినట్టు సమాచారం.వివరాల ప్రకారం కె శ్రావణి అనే వివాహితను హత్య చేశాడు పరవాడకు చెందిన గోపాలకృష్ణ అనే యువకుడు. అర్థరాత్రి మూడు గంటల సమయంలో బీచ్‌కు వచ్చారు శ్రావణి, గోపాలకృష్ణ. ఇరువురు మధ్య వాగ్వాదం జరగడంతో శ్రావణిని హత్య చేశాడు గోపాలకృష్ణ. జగదాంబలో ఓ షాపింగ్ మాల్‌లో పని చేస్తున్న శ్రావణిని గోపాలకృష్ణ ప్రేమిస్తున్నాడు. అయితే.. వీరి మధ్యం ఏం జరిగిందో తెలియదు కానీ.. ఆ మహిళను గోపాలకృష్ణ హత్య చేశాడు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love