బి.ఎడ్. సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ఏడవరోజు ప్రశాంతం..

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో బి.ఎడ్.  మొదటి సెమిస్టర్ రెగ్యులర్  పరీక్షలు ఏడవరోజు  ప్రశాంతంగా జరిగాయి.గురువారం జరిగిన పరీక్షలకు 412 మంది విద్యార్థులకు 388 మంది విద్యార్థులు హాజరయ్యారు 24 మంది గైరాజరయ్యారు.
బి.ఎడ్ పరీక్ష కేంద్రాలు..
 గిరిరాజ్ గవర్నమెంట్ డిగ్రీ కాళాశాల నిజామాబాద్, ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కామారెడ్డి, ఎస్ ఆర్ ఎన్ కే ప్రభుత్వ  డిగ్రీ కాళాశాల బాన్సువాడ,ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్మూర్, ప్రభుత్వ డిగ్రీ కాళాశాల బోధన్  సెంటర్ ల లో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని   ఆడి సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు.
Spread the love