భోళా మానియా షురూ..

చిరంజీవి, మెహర్‌ రమేష్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘భోళా శంకర్‌’. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ చివరి దశలో ఉంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తొలుత మ్యూజికల్‌ జర్నీ ‘భోళా మానియా’ త్వరలో ప్రారంభమవుతుందని మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు. మహతి స్వర సాగర్‌ ఈ చిత్రానికి చార్ట్‌బస్టర్‌ ఆల్బమ్‌ని స్కోర్‌ చేసారు.
కొంత టాకీ పార్ట్‌, క్లైమాక్స్‌ షూటింగ్‌, భారీ సెట్‌ సాంగ్‌ ఇంకా చిత్రీకరించాల్సి ఉంది. షూటింగ్‌తోపాటు పోస్ట్‌ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా శరవేగంగా జరుగుతోంది. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అనిల్‌ సుంకర నిర్మిస్తున ఈ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌లో తమన్నా కథానాయికగా నటిస్తుండగా, చిరంజీవి సిస్టర్‌గా కీర్తి సురేష్‌ కనిపించనుంది. సుశాంత్‌ లవర్‌ బారు పాత్ర పోషించారు. ఈ చిత్రం ఆగస్టు 11న
ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Spread the love