అయినా.. రిస్క్‌ చేశా

మాస్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై ఎస్‌కేఎన్‌ నిర్మించిన చిత్రం ‘బేబీ’. ఈ చిత్రానికి సాయి రాజేష్‌ దర్శకత్వం వహించారు. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ ముఖ్య పాత్రధారులుగా నటించిన ఈ సినిమా ఇటీవల విడుదలై బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది.
ఈ సందర్భంగా దర్శకుడు సాయి రాజేష్‌ మీడియాతో మాట్లాడుతూ, ‘సేలం జిల్లాలో ఇద్దరబ్బాయిలు కలిసి ఓ అమ్మాయి మీద క్రూరంగా దాడి చేసిన ఫోటోలు చూశాను. అసలు ఆ అమ్మాయికి ఏం జరిగి ఉంటుందని ఆమె పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో ఆలోచించడం మొదలు పెట్టినప్పుడు ఈ బేబీ కథ పుట్టింది. ఈ సినిమా నా మనసుకు నచ్చింది. నా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సేఫ్‌ అవుతారని నమ్మకం ఉంది. అలాగే ఈ సినిమా ఫ్లాప్‌ అవుతుందనే భయం కూడా ఉండేది. దీంతో నా కెరీర్‌ నాశనం అవుతుందని తెలిసినప్పటికీ రిస్క్‌ చేశాను. దర్శకుడు సుకుమార్‌ సినిమా చూసి ప్రశంసిస్తుంటే.. నాకు మాటలు రాలేదు’ అని తెలిపారు.

Spread the love