చంద్రబాబు కటౌట్ కు బుద్దా వెంకన్న రక్తాభిషేకం..

నవతెలంగాణ – హైదరాబాద్: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తనకు దేవుడితో సమానమని పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న చెప్పారు. ప్రాణం ఉన్నంత వరకూ ఆయనకు విధేయుడిగా ఉంటానని పేర్కొన్నారు. తన రక్తంలోని చివరి బొట్టు వరకూ ఆయనకే ధారబోస్తానని చెప్పుకొచ్చారు. ఇది నిరూపించుకోవడానికి ఆదివారం చంద్రబాబు కటౌట్ కు బుద్దా వెంకన్న రక్తాభిషేకం చేశారు. తన శరీరంలో నుంచి రక్తం తీసి చంద్రబాబు కటౌట్ పాదాలకు అభిషేకం చేయడంతో పాటు గోడపై సీబీఎన్ జిందాబాద్, నా ప్రాణం మీరే.. అంటూ నినాదం రాశారు. అనంతరం బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తనకు దేవుడని, ప్రాణం ఉన్నంత వరకూ ఆయనకు విధేయుడిగా ఉంటానని చెప్పారు.

Spread the love