నవతెలంగాణ-హైదరాబాద్ : నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్, వరంగల్లో పర్యటించనున్నారు. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం నామినేషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా ఉదయం దాన నాగేందర్ నామినేషన్ ర్యాలీలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం వరంగల్లో జరిగే బహిరంగ సభకు సీఎం రేవంత్రెడ్డి హాజరుకానున్నారు. అయితే.. ఇవాళ హన్మకొండ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. కాగా.. మడికొండలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న ప్రజా గర్జన సభలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కె. ఆర్. నాగరాజు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, సెంట్రల్ జోన్ డిసిపి ఎంఏ భారీ తో కలిసి హెలిపాడ్ సెంటర్ పార్కింగ్ స్థలాలను పరిశీలించారు.