నేదునూరులో కాంగ్రెస్‌ నాయకుల ప్రచారం

– ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి
– కాంగ్రెస్‌ ప్రచార కమిటీ సభ్యులు సరికొండ మల్లేష్‌
నవతెలంగాణ-కందుకూరు
ప్రతి ఒక్కరూ కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కాంగ్రెస్‌ ప్రచార కమిటీ సభ్యులు సరికొండ మల్లేష్‌ పిలుపునిచ్చా రు. కాంగ్రెస్‌ గ్రామ అధ్యక్షులు బోర్ర సురేష్‌ అధ్యక్షతన శుక్రవారం కందుకూరు మండల్‌ నేదునూరు, మాన్య గూడ గ్రామాలలో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి రంజిత్‌ రెడ్డి గెలుపు కోసం ప్రచారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలిని కోరారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు గంగుల ప్రభాకర్‌ రెడ్డి, ఎండీ అఫ్జల్‌ బేగ్‌, ఎగిరిశెట్టి నరసింహ, ఇంద్రకంటి రాకేష్‌ గౌడ్‌, పడమటి సురేందర్‌ రెడ్డి, సరు గారి మా ధవ రెడ్డి, గడిగా రాములు గౌడ్‌, మర్ల రాములు యాదవ్‌, బోయ భాస్కర్‌, దేవరకొండ రాములు, నాగరాజు, వరి కుప్పల బాబు, కరుణాకర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Spread the love