నవతెలంగాణ – హైదరాబాద్: ఓవైపు దేశ రాజధాని దిల్లీలో ప్రతిష్ఠాత్మకమైన జీ-20 శిఖరాగ్ర సమావేశాలకు రంగం సిద్ధం అవుతోంటే.. మరోవైపు ఉగ్రదాడి కుట్ర బయటపడటం ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్, నేషనల్ వార్ మెమోరియల్ సహా పలు ప్రాంతాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమై రక్షణ చర్యలను పటిష్ఠం చేశారు. బిహార్కు చెందిన బన్సీ ఝా అనే వ్యక్తి.. పాకిస్థాన్కు గూడఛారిగా వ్యవహరిస్తున్నాడని కోల్కతా పోలీసులకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. వెంటనే స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) డిటెక్టివ్లు.. బిహార్కు వెళ్లి అతడిని అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా అతడి నుంచి మరింత సమాచారం తెలుసుకున్నారు. ఢిల్లీ, కోల్కతా, చెన్నైలోని ప్రముఖ ప్రాంతాలకు చెందిన చిత్రాలను తీసి అతడి పాకిస్థాన్కు పంపినట్లు గుర్తించారు.