కేజ్రీవాల్ రోజూ మామిడి పండ్లు తింటున్నాడని కోర్టుకు తెలిపిన ఈడీ..!

నవతెలంగాణ – ఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి జైలులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉన్న విషయం తెలిసిందే. అక్కడి నుండే ఢిల్లీ ప్రభుత్వ పాలనని చూస్తున్నారు జైలులో ఉండి ఆదేశాలు ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే కేజ్రీవాల్ బెయిల్ పొందడం కోసం జైల్లో రోజూ మామిడి పండ్లు తింటున్నారని కోర్టుకి ఈడీ తెలిపింది. మామిడి పండ్లు తింటే షుగర్ వస్తుందని అందుకే కేజ్రీవాల్ రోజు జైల్లో మామిడి పండ్లు తింటున్నాడని కోర్టుకి ఈడీ చెప్పింది. ఢిల్లీ ప్రభుత్వ పాలన్నీ జైలు నుండి చూసుకుంటున్నారు. జైల్లో ఉండే ఆదేశాలు ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలకు కూడా పలు సందేశాలు పంపిస్తున్నారు. దీనిలో భాగంగానే కేజ్రీవాల్ పంపించిన సందేశాలను ఇప్పటిదాకా ఆయన సతీమణి సునీత మీడియాకి వినిపించారు.

Spread the love