ఉపాధి హామీ పనులను సక్రమంగా నిర్వహించాలి

– ఎంపీడీవో నరేందర్‌ రెడ్డి
– అకస్మాత్తుగా రికార్డుల తనిఖీ
నవతెలంగాణ-యాచారం
గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను సక్రమంగా నిర్వహించాలని ఎంపీడీవో నరేందర్‌ రెడ్డి సూ చించారు. శనివారం మండల పరిధిలోని గడ్డమల్లయ్య గూడ, చిన్నతుండ్ల గ్రామపంచాయతీల్లో అకస్మాత్తుగా రికార్డులను తనిఖీ చేసి జరుగుతున్న ఉపాధిహామీ పను లను ఎంపీడీవో పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పని ప్రదేశాల్లో ఎలాంటి అవకతవకలూ జరగకుండా చూడాలన్నారు. పనిచేసిన కూలీలకు వెం టనే డబ్బులు వారి ఖాతాల్లో జమ అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. నర్సరీలో పెంచుతున్న మొక్క లు ఎండిపోకుండా సరిపడ నీటిని అందించాలన్నారు. గ్రామపంచాయతీ రికార్డులు రోజువారీగా నిర్వహించా లని చెప్పారు. తప్పులు జరుగుతే శాఖా పరమైన చర్యలు తప్పవని కింది స్థాయి అధికారులను హెచ్చరించారు. కా ర్యక్రమంలో పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love