అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ‘జులాయి’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ సినిమాలు రూపొందాయి. ఈ మూడు సినిమాలు కూడా ఒకదానికి మించి మరొకటి ఘన విజయం సాధించిన విషయం విదితమే. ముఖ్యంగా ‘అల వైకుంఠపురములో’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందింది.
గురు పూర్ణిమ శుభ సందర్భంగా వీరి కలయికలో నాలుగో సినిమా ప్రకటన వచ్చింది. ఈసారి ఈ కలయిక తెలుగు ప్రేక్షకులతో పాటు ప్రపంచ సినీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ అద్భుతమైన కథాకథనాలు, ఈ కలయికలో వచ్చిన ప్రతి సినిమాని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాయి. ‘రవీంద్ర నారాయణ్’, ‘విరాజ్ ఆనంద్’, ‘బంటు’ వంటి పాత్రల్లో అల్లు అర్జున్ జీవించారు. ప్రతి పాత్ర సినీ ప్రేమికుల హదయాలలో ప్రత్యేక స్థానాన్ని పొందాయి.
అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.8 కోసం అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి జతకట్టారు. వీరి కాంబోలో రూపొంది ప్రేక్షకుల హదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మూడు సినిమాలనూ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ భారీ స్థాయిలో నిర్మించడం ఓ విశేషమైతే, తాజాగా ఈ నాలుగో సినిమాని కూడా అదే భారీస్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులందరినీ సంతప్తి పరచడానికి అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్తో కలిసి ‘అల వైకుంఠపురములో’ నిర్మాణంలో భాగమైన గీతా ఆర్ట్స్ ఇప్పుడు ఈ చిత్ర నిర్మాణంలోనూ భాగం అవుతుంది. ఈ చిత్రాన్ని అల్లు రామలింగయ్య, మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.