గీత కార్మికులకు అండగా ఉంటా: మాజీ మంత్రి కేటీఆర్

నవతెలంగాణ – తంగళ్ళపల్లి
నిత్యం ఉపాధి పొందే గీత కార్మికుల తాటివనం ప్రమాదవశాత్తు కాలిపోయిందని వాటిపై ఉపాధి పొందేకి గీత కార్మికులందరికీ అండగా ఉంటానని మాజీ మంత్రి కేటీఆర్  అన్నారు. తంగళ్ళపల్లి మండలం తాడూరు గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు కాలిపోయిన తాటివనాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. అలాగే గీత కార్మికులతో మాట్లాడారు. భారీగానే తాటి వనం కాలిపోయిందని ఇవి మళ్లీ చిగురిస్తాయా అని అడిగి తెలుసుకున్నారు. లేదంటే వాటి స్థానంలో అవి తొలగించి కొత్త చెట్లను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. గీత కార్మికులకు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు అండగా ఉందని, ప్రభుత్వం లేకపోయినా సరే బిఆర్ఎస్ పార్టీ నేత,గీత కార్మికులకు తోడు నీడగా పనిచేస్తుందన్నారు. అనంతరం గీత కార్మికులు ఆదుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం గోపాలరావు పల్లె గ్రామంలో జరుగుతున్న ఎల్లమ్మ సిద్దు గానికి హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే పాపయ్య పల్లె గ్రామంలో జరుగుతున్న పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Spread the love