‘ఘాన్సీమియాగూడ రైతులకు అండగా ఉంటా’

నవతెలంగాణ-శంషాబాద్‌
మండల పరిధిలోని ఘాన్సీమియాగూడ రైతులకు అండగా ఉంటానని మైలార్‌దేవ్‌పల్లి కార్పొరేటర్‌ తోకల శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం గోల్డ్‌ స్టోన్‌ అక్రమాలపై స్పందించిన ఆయన సమస్యపై రైతులతో మాట్లాడారు. ఘాన్సీమి యా గూడలో జరుగుతున్న మోసాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. గోల్డ్‌ స్టోన్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ స్థానిక రైతుల భూముల పై అక్రమ పత్రాలు సృష్టించి, రైతుల మీద కేసులు పెట్టిస్తూ వారిని వేధిస్తున్నారని అన్నారు. సుమారు రెండేళ్ల నుంచి రైతుల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యేకు ఎన్ని సార్లు తెలియజేసినా పట్టించుకోవడం లేదన్నారు. స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకులు గోల్డ్‌ స్టోన్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థతో కుమ్మక్కు కావడం వలన సమస్య పరిష్కరించట్లేదన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం కృషి చేస్తానని అన్నారు. అంజి, పాముల జంగయ్య, ఎం.రవీందర్‌ గౌడ్‌, డి.మల్లేష్‌ యాదవ్‌, దరమొని బాబు, పాముల రాజు, పాముల చంద్రయ్య, మల్లేష్‌ గౌడ్‌, అనుపురం బాల్‌ రాజ్‌, తోక మల్లేష్‌ గౌడ్‌, నిరటి శ్రీకాంత్‌, సిద్దెంతి దివాకర్‌ గౌడ్‌, పోతన పల్లి లాలయ్య, తదితరులు పాల్గొన్నారు.

Spread the love