మాక్లూర్ లో రాళ్ల వాన

నవతెలంగాణ – మాక్లూర్

మండల కేంద్రంలో రాళ్ల వాన శుక్రవారం సాయంత్రం కురిసింది. రాళ్ల వాన కురియడంతో రతులు ఆందోళన చెందుతున్నారు. వరి పంట కోతకు వచ్చిన పొలాల్లో ధాన్యం రాలిపోయి రైతులు నష్టపోతున్నారు. దిగుబడి రాక, పెట్టుబడి ఎల్లక రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
Spread the love