– జజీరా ఎయిర్వేస్ వెల్లడి
హైదరాబాద్ : కువైట్కు చెందిన చౌక విమానయాన సంస్థ జజీరా ఎయిర్వేస్ తాజాగా బెంగళూరు, హైదరాబాద్ మధ్య సేవలను ప్రారంభించినట్లు వెల్లడించింది. బెంగళూరు నుంచి రోజుకు నాలుగు, హైదరాబాద్ నుంచి ఆరు విమానాల చొప్పున నడపనున్నట్లు తెలిపింది. 2017లో హైదరాబాద్తో తన భారత కార్యకలాపాలను ప్రారంభించగా.. ప్రస్తుతం ఆరు గమ్య స్థానాలకు సేవలు అందిస్తోన్నట్లు వెల్లడించింది.