కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించాలి

– కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి
– వడ్డెకొత్తపల్లి బీఆర్ఎస్ కు బిగ్ షాక్, కాంగ్రెస్ లో చేరికలు
నవతెలంగాణ – పెద్దవంగర
రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య ను భారీ మెజార్టీతో గెలిపించాలని పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి అన్నారు. మండలంలోని వడ్డెకొత్తపల్లి గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఆమె కండువా కప్పి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లిందన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రజలను మోసం చేశారని, బీఆర్ఎస్, బీజేపీ పార్టీ లను నమ్మెద్దన్నారు. పార్టీలో చేరిన నాయకులకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కడియం కావ్య గెలుపు కోసం పార్టీ శ్రేణులు సైనికుల్లా  పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. పార్టీ లో చేరిన వారిలో ఏఎంసీ కొడకండ్ల మాజీ చైర్మన్ ముత్తినేని రమాదేవి శ్రీనివాస్, తంగెళ్ళపల్లి మల్లికార్జున చారి తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ నెమరుగొమ్ముల ప్రవీణ్ రావు, సీనియర్ నాయకులు జాటోత్ నెహ్రు నాయక్, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, ఉపాధ్యక్షుడు రంగు మురళి గౌడ్, సలిదండి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love