ముంబయి : దేశంలోనే అతిపెద్ద ఐటి కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) చీఫ్ ఎగ్జి క్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ)గా క్రితివాసన్ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటి వరకు ఈ హోదాలో పని చేసిన రాజేష్ గోపినాథన్ ఇటీవల ఆయన తన పదవికి రాజీనామా చేశారు. టిసిఎస్తో తనకు 20 ఏండ్ల అనుబంధం ఉందని.. తనకు సహకరించిన ఉద్యోగులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సిబ్బందికి ఆయన ఓ లేఖ రాశా రు. ఆరేండ్లు సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించడం గర్వంగా ఉందన్నారు.