మన్ కీ బాత్ ప్రోగ్రాం వీక్షించిన మండల ప్రజలు

నవతెలంగాణ – గోవిందరావుపేట
భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ మన్ కీ బాత్ ప్రోగ్రాం లో భాగంగా ఆదివారం మండల కేంద్రంలో గ్రామ భారతీయ జనతా పార్టీ శక్తి కేంద్ర ఇన్చార్జి సామల శ్రీనివాస్ ఇంటి వద్ద పలువురు వీక్షించారు. గోవిందరావుపేట మండల అధ్యక్షులు మద్దినేని తేజరాజు మరియు మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు అంకిరెడ్డి రమాదేవి సమక్షంలో ప్రధాని నరేంద్ర మోది మన్ కీ బాత్ ప్రోగ్రాం వీక్షించడం జరిగింది. ఇందులో భాగంగా గోవిందరావుపేట గ్రామ పార్టీ కార్యకర్తలు అంతిరెడ్డి సత్యనారాయణరెడ్డి దావుల స్వప్న నగరపు జగదాంబ గుగ్గిళ్ళ సమ్మయ్య మల్లేశం మందాడి సంపత్ రెడ్డి పుష్ప గొల్లకట్టయ్య సరోజన ఎర్రమ్మ ఈశ్వరమ్మ నర్మదా నాగమణి మచ్చాపూర్ బూత్ కమిటీ అధ్యక్షులు కార్యదర్శులు నీరటి కుమార్ ఓదెల గణేష్ సామల శ్రీనివాస్ లు ప్రధానమంత్రి మన్ కీ బాత్ వీక్షించిన వారిలో ఉన్నారు.

Spread the love