గంజాయి పట్టివేత

నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మం నగరంలోని ఎండు గంజాయిని విక్రయిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు ఖమ్మం ఎక్సైజ్‌ వన్‌ స్టేషన్‌ సీఐ రాజు తెలిపారు. నగరంలో టేకులపల్లి ఎన్‌ఎస్పీ బ్రిడ్జి సమీపంలో ఎండు గంజాయి విక్రయిస్తున్నారని సమాచారం తో తనిఖీలు నిర్వహించగా కొల్లాపూడి సురేష్‌ అలియాస్‌ మనోహర్‌, ఏపురి ఉదరు అలియాస్‌ చిన్ను, గందమల్ల పవన్‌ కళ్యాణ్‌ అనే ముగ్గురు 2 బైక్‌లపై పారిపోతుండగా వారిని పట్టుకొని వారి వద్ద అమ్మకానికి సిద్దంగా ఉన్న 1.1 కేజీల ఎండు గంజాయితో పాటు గంజాయి అమ్మకాలకు రవాణాకు వినియోగిస్తున్న పల్సర్‌ బైక్‌, హౌండా డియో స్కూటర్‌లను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసి రిమాండ్‌ కు తరలించినట్లు తెలిపారు. నిందితులు ఖమ్మం రూరల్‌ మండలం ఎం. వెంకటాయపాలెంకు చెందిన వారు. వీరు గత కొన్ని రోజులుగా ఖమ్మం నగరానికి ఉపాధి కోసమని వస్తూ, ఎండు గంజాయిని ఎన్‌ఎస్పీ కెనాల్‌ పరిసర ప్రాంతాల్లో అమ్ముతున్నట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్‌ అధికారులు వి. రవి, షేక్‌ రబ్బానీ, సిబ్బంది రామారావు, శశికాంత్‌, రమేష్‌, మారేశ్వరరావు, రవి తదితరులు పాల్గొన్నారు.

Spread the love