న్యూఢిల్లీ : ఎలక్ట్రిక్ మోటార్బైక్ ఎరా కోసం ప్రీబుకింగ్స్ను ప్రారంభించినట్లు సాంకేతిక ఆవిష్కరణల ఆధారిత స్టార్టప్ మ్యాటర్ తెలిపింది. దేశంలోని 25 జిల్లాల్లో రూ.1,999తోనే బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, కృష్ణా నగరాల్లోని వారు ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ దీన్ని పొందవచ్చన్నారు. మ్యాటర్ ఎరా ప్రారంభ ధరను రూ.1,43,999గా నిర్ణయించింది.