నవతెలంగాణ-అంబర్పేట
పార్కుల సుందరీకరణకు నిరంతరం కృషి చేస్తున్నా నని అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గురువారం నల్లకుంట డివిజన్ పరిధిలోని తిలక్ నగర్లో రూ.44 లక్షలతో నల్లకుంట డివిజన్ పరిధిలోని తిలక్ నగర్ పార్కులో చేపట్టనున్న అభివృద్ధి సుందరీకరణ పను లకు కార్పొరేటర్ అమృతతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో నగరంలో పచ్చదనం పెంపుతో పాటు, ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్టు తెలిపారు. అంబర్పేట నియోజకవర్గం లోని అన్ని పార్కుల్లో అనేక రకాల మొక్కలు పెంచి, సుంద రీకరణతో పాటు ప్రజలకు సౌకర్యంగా ఉండే ప్రత్యేక వాకింగ్ ట్రాక్లు, కొత్త బెంచీలు, తాగు నీటి ఏర్పాట్లు, పెయింటింగ్, టైల్స్ ఏర్పాటు చేయడం, విద్యుత్ దీపాలు, పార్కు చుట్టూ ప్రహరీ, గేట్లతో పాటు చిన్నారులు ఆడుకో వడానికి అనేక క్రీడా సాధనాలు కూడా ఏర్పాటు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తిలక్నగర్ పార్కు పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలనీ, నిర్ణీత గడువులో పనులను పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురా వాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నల్లకుంట బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు మేడి ప్రసాద్, నాయకులు మధు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.