కాంగ్రెస్‌ పాలన పట్ల ప్రజలకు విశ్వాసం పోయింది

– కార్పొరేటర్‌ బి.విజయ శేఖర్‌ గౌడ్‌
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కాంగ్రెస్‌ పాలన పట్ట ప్రజలకు విశ్వాసం పోయిం దని కార్పొరేటర్‌ బి. విజయ శేఖర్‌ గౌడ్‌ అన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో నాలుగు నెలల్లోనే ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం పోతుంద ని రంగారెడ్డినగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ బి.విజయ శేఖర్‌ గౌడ్‌, విమర్శించారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపిం చాలి కోరుతూ డివిజన్‌ పరిధి గురుమూర్తి నగర్‌ ప్రాంతంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 25 ఏండ్లుగా రాజకీయాలకతీతంగా ప్రజాసేవలో నిమగమై ఎన్నో సామాజిక కార్యక్రమా లను నిర్వహిం చిన నాయకుడు బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మా రెడ్డి అని అన్నారు. మరోపక్క ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలి పదవుల కోసం పాకులాడే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు చిత్తశుద్ధి లోపించిం దని అన్నారు. మల్కాజిగిరి పార్లమెం ట్‌ పరిధిలోని ఏడు నియోజక వర్గాలలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, కార్పొరేట ర్‌లే అధికంగా ఉన్నారని ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించు కుందామని కార్యకర్తల్లో జోష్‌ నింపారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడే నాయకులు కావాలి కానీ, పదవుల కోసం పాకులాడే నాయకుడు అవసరమా అని ఇలాంటి నాయకులను మే 13న జరిగే ఎన్నికల్లో ఓడించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ అధ్యక్షులు ఏర్వ శంకరయ్య, ప్రధాన కార్యదర్శి జి.సుధాకర్‌, పాల్గొన్నారు.

Spread the love