– ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు
నవతెలంగాణ-కేపీహెచ్బీ
ప్రజా శ్రేయస్సు కోరే మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని అత్యధిక మేజా ర్టీతో గెలిపించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు అన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపే లక్ష్యంగా శుక్రవారం బాలాజీనగర్ డివిజన్ పరిధిలోని టి.అంజయ్య నగర్ నుంచి నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో ఆయనతో పాటు స్థానిక కార్పొరేటర్ పగుడాల శీరిష బాబురావులు పాల్గొని, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమం లో మాజీ కార్పొరేటర్ పగుడాల బాబురావు, డివిజన్ అధ్యక్షులు సిహెచ్ ప్రభాకర్ గౌడ్, ఖాజా పాషా, ఫయాజ్, యాధుల్, ఖదీర్, గౌస్, సప్పిడి శ్రీనివాస్ రావు, రవీందర్, సమీర్, థౌఫిక్, అనితా శ్రీపాద, సావిత్రి, స్వప్న, అన్నపూర్ణ, పద్మ, లావణ్య, తదితరులు పాల్గొన్నారు.