ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ.. పెన్షనర్లకు డీఆర్‌ విడుదల

– జీవో జారీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్‌ను విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని బేసిక్‌ పే/ పెన్షన్‌పై 2.73 శాతం విడుదల చేయనున్నారు. పెరిగిన డీఏ, డీఆర్‌ 2023 జూన్‌ నుంచి అమల్లోకి వస్తుంది. జులై 2023 వేతనంతో కలిపి దీన్ని చెల్లిస్తారు. ఈ నిర్ణయంతో రూ.1,380 కోట్ల డీఏ బకాయిల చెల్లింపుతోపాటు ప్రభుత్వ ఖజానాపై నెలకు రూ.81.18 కోట్లు, ఏడాదికి రూ.974.16 కోట్ల అదనపు భారం పడనుంది. ఉద్యోగులు, పెన్షనర్లు కలిపి మొత్తం 7.28 లక్షల మంది ప్రయోజనం పొందనున్నారు.

Spread the love