కారు పాడైంది.. షెడ్డు నుంచి రాదు: రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ – మహబూబ్‌నగర్‌: కారు షెడ్డు నుంచి బయటకు రాదు.. పాడైపోయిందని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. మహబూబ్‌నగర్‌లో ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘‘20 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని కేసీఆర్‌ అంటున్నారు. ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్‌రెడ్డి. మా ఎమ్మెల్యేలను ముట్టుకో.. మాడి మసైపోతావు. పాలమూరు కోసం అనేక ప్రాజెక్టులు చేపట్టాం. పదేళ్లుగా ఈ జిల్లాను ఎడారిగా మార్చారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చారా? పార్లమెంటులో నిద్రపోవడానికా భారాసకు ఓటు వేయాలి?’’ అని రేవంత్ ప్రశ్నించారు.

Spread the love