భూసేకరణ సమస్యలపై సమీక్షా సమావేశం

మందమర్రి : పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ సమస్యలపై మంచిర్యాల అదనపు కలెక్టర్‌ సభావత్‌ మోతీలాల్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ కార్యాలయం లో బుధవారం మందమర్రి ఏరియా జనరల్‌ మేనేజర్‌ మనోహర్‌, శ్రీరాంపూర్‌ ఏరియా జనరల్‌ మేనేజర్‌ సంజీవరెడ్డి, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు మందమర్రి, జైపూర్‌, తహసీల్దార్లతో సమీక్షించారు. ఈ సమావేశంలో సింగరేణిలో ఉన్న ఆర్‌అండ్‌ఆర్‌, భూ సేకరణ సమస్యలపై చర్చించారు. పెండింగ్‌లో ఉన్న ఆర్‌అండ్‌ఆర్‌ భూసేకరణ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని అడిషనల్‌ కలెక్టర్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Spread the love