గిరిజనుడిపై దాడి చేసిన ఎక్సైజ్ సీఐని సస్పెండ్ చేయాలి: సంతోష్ నాయక్   

– భారత ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి సంతోష్ నాయక్ 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
జనగాం జిల్లా తరిగొప్పుల మండలం బోత్తల పల్లె గ్రామానికి చెందిన భూక్య రవి ని గుడుంబా సరఫరా చేస్తున్నాడనే నేపథ్యంతో హుస్నాబాద్ ఎక్సెస్ సీఐ పవన్ రెడ్డి ఆ కారణంగా దాడి చేసి గాయపరచి, కులం పేరుతో దూషించిన హుస్నాబాద్ ఎక్సెజ్ సీఐ పవన్ రెడ్డిని సస్పెండ్ చేయాలని భారత ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి సంతోష్ నాయక్ శనివారం  ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. భూక్య రవి ఏమన్నా తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తప్ప దాడి చేసి బూటు కాలుతో తన్నే అధికారం హుస్నాబాద్ ఎక్సెజ్ సీఐ పవన్ రెడ్డికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ఎక్సెజ్ సీఐని వెంటనే ఉద్యోగం నుండి తొలగించాలని, అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు.
Spread the love