క్వార్టర్స్‌లో సాత్విక్‌ జోడీ

Satvik pair in the quarters– గాయత్రి జంట ఇంటిబాట
– ప్రపంచ చాంపియన్‌షిప్స్‌
కోపెన్‌హాగన్‌ : ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్స్‌లో భారత స్టార్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టిలు క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించారు. రెండో సీడ్‌ సాత్విక్‌, చిరాగ్‌లు పురుషుల డబుల్స్‌ ప్రీ క్వార్టర్స్‌లో ఇండోనేషియా షట్లర్లపై మూడు గేముల్లో గెలుపొందారు. 61 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో 21-15, 19-21, 21-9తో మనోళ్లు అదరగొట్టే విజయం సాధించారు. నేడు జరిగే క్వార్టర్‌ఫైనల్లో 11వ సీడ్‌ డెన్మార్క్‌ జోడీ కిమ్‌, ఆండర్స్‌తో సాత్విక్‌, చిరాగ్‌ ఢకొీట్టనున్నారు. మహిళల డబుల్స్‌లో గాయత్రి, ట్రెసా జాలి జంట పోరాటం ముగిసింది. 15వ సీడ్‌ గాయత్రి, ట్రెసాలు 14-21, 9-21తో టాప్‌ సీడ్‌ చెన్‌, జియ జోడీ చేతిలో వరుస గేముల్లోనే ఓటమిపాలైంది.

Spread the love