– నాలుగు నెలలు గడిస్తే అంతా సెట్ అవుతుంది
– డాక్టర్ జిఎస్ఆర్ ట్రస్టు ఫౌండర్, రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు
నవతెలంగాణ-కొత్తగూడెం
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇంకెన్ని రోజులు ప్రజలను బెదిరిస్తారని, నాలుగునెలలు గడిస్తే అన్ని సెట్ అవుతాయని, 80 ఏండ్లు వచ్చాయి ఇక సెలవు తీసుకోండి పెద్దాయన అని డాక్టర్ గడల శ్రీనివాసరావు మాటలు హీట్ పెంచాయి. డాక్టర్ జిఎస్ఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో లక్ష్మీదేవిపల్లి మండలంలోని పలు గ్రామాల్లో వాలీబాల్ ట్రోర్నమెంట్స్ నిర్వహించారు. గెలుపొందిన క్రీడా జట్లకు మెంమోంటో, ప్రశంసా పత్రాలు అందజేశరు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ గడల శ్రీనివాసరావు మాట్లాడారు. ఆయన చేసిన కామెంట్స్ తొలిసారి రాజకీయాల్లో వేడిపుట్టించాయి. సేవా కార్యక్రమాలకు వచ్చే వారిని బెదిరింపులకు పాల్పడం పట్ల ఆయన తీవ్రంగా స్పందించారు. గత ఎన్నికలే నాకు లాస్ట్ అని… ప్లీజ్ ఒక్కసారి గెలిపించండీ అని ప్రజలను వేడుకున్న ఆయన ఈ సారి మళ్లీ పోటీలో ఉంటానని చెప్పాడం విడ్డూరంగా ఉందన్నారు. పెద్దాయన ఇక రెస్టు తీసుకో….80 ఏండ్లు వచ్చాయి… రిటైర్డ్ మెంట్ తీసుకో అని సూచించారు. ఇంకా ఎంత కాలం వృద్ధాప్యంలో కష్టపడుతారు…అని సూచించారు. ఉల్వనూరు గ్రామంలో వాలీబాల్ పోటీల సందర్భంగా డాక్టర్ గడల హాట్ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
నేను మంచి చేయడానికి వస్తే…నావాళ్లని అడ్డుకుంటారా….? ఇది మంచి పద్దతి కాదాని హితవు పలికారు. పోన్చేసి బెదిరింపులు చేయడం సరికాదాని హెచ్చరించారు. ఆదివాసీ ప్రాంతాల్లో తన తండ్రి 50 ఏళ్ళు ఆయుర్వేదిక్ డాక్టర్గా తిరుగుతూ సేవ చేసేవారన్నారు. ఆదివాసీలు తమను గుండెల్లో పెట్టుకున్నారని వారి ఋణం తీర్చుకోలేనిదన్నారు. మరో 4నెలలు ఓపిక పట్టండి అన్నీ సెట్ అవుతాయన్నారు. కొత్త కొత్తగూడెంను చూద్దామని, కొత్త కొత్తగూడెం నిర్మించుకుందామని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన టీంలకు బహుమతులు అందజేశారు.