కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో తెలంగాణ అవిర్భావ దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ-పరిగి
పరిగి పట్టణ కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ అవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి తన నివాసంలో జెండా ఎగరవేశారు. అనంతరం కొడంగల్‌ చౌరస్తాలో సోనియాగాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పరిగి మండల పరిధిలోని రాఘవపూర్‌ గ్రామంలో కాంగ్రెస్‌ పరిగి మండల అధ్యక్షుడు పరుశురాం రెడ్డి ఆధ్వర్యంలో సోనియాగాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్‌ పార్టీ అని అన్నారు. తొమ్మిదేళ్ల పాలల్లో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు లాల్‌ కృష్ణ, అశోక్‌, ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్‌, పట్టణ అద్యక్షులు ఎర్రగడ్డ పల్లీ కృష్ణ, జిల్లా నాయకులూ బాదం శ్రీనివాస్‌ గుప్త, మాధవరెడ్డి,సర్వర్‌,అనేం ఆంజనేయులు, ఆకరాపు జగన్‌,మహిపాల్‌, పట్టణ ఉపాధ్యక్షులు యేజాస్‌, రామకృష్ణరెడ్డి, నసీరుద్దీన్‌,మోయిస్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భాస్కర్‌, కౌన్సిలర్‌ మల్లేష్‌, సత్యనారాయణ రెడ్డి, యువనాయకులు గణేష్‌, నాగవర్థన్‌, రుఫ్ఖన్‌ పేట్‌ అశోక్‌, హరిశ్చంద్ర, అరిఫ్‌ పటేల్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love