నేడు కాంగ్రెస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశం

నవతెలంగాణ-ఆమనగల్‌
పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో శనివారం ఆమనగల్‌, కడ్తాల్‌ మండలాల కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్టు ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు తెల్గమల్ల జగన్‌, సబావత్‌ బిచ్యా నాయక్‌ వేర్వేరుగా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని అయ్యసాగర్‌ క్షేత్రం సమీపంలో ఉన్న డీఎంకే ఫంక్షన్‌ హాల్లో జరుగ నున్న ఈసమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ మల్లు రవి, టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్‌గౌడ్‌, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్‌ రెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీపాతి శ్రీనివాస్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీక్యా నాయక్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు యాట నర్సింహ ముదిరాజ్‌ తదితరులు హాజరై ఎన్నికల ప్రచారానికి దిశానిర్దేశం చేస్తారని వారు తెలిపారు. శనివారం ఉదయం ప్రారంభమయ్యే సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీ, కిసాన్‌ సెల్‌, ఎన్‌ఎస్‌ యూఐ తదితర అనుబంధ సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని వారు కోరారు.

Spread the love