విషాదం: గోడకూలి ముగ్గురు కార్మికులు మృతి

నవతెలంగాణ- మహారాష్ట్ర: పాల్ఘర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం నిర్మాణంలో ఉన్న గోడ కూలి ముగ్గురు మహిళా కూలీలు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. విరార్ ప్రాంతంలోని మన్వేల్‌పాడలోని నిర్మాణ స్థలంలో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని ఓ అధికారి తెలిపారు. శిథిలాల నుంచి మహిళలను బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా, చేర్చకముందే వారు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారని ఆయన చెప్పారు. మృతులను షౌబాయి సులే (45), లక్ష్మీ ఘవానే (45), రాధా నవ్‌ఘరే (40)గా గుర్తించారు. ఈ ఘటనలో మరో మహిళ గాయపడి చికిత్స పొందుతోంది, విరార్ పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నట్లు అధికారి తెలిపారు. ముగ్గురు మహిళల మృతితో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Spread the love