రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు

– వర్షంలో సైతం ప్రమాదవ స్థలానికి చేరుకొని ఆస్పత్రికి తరలించిన బిఆర్ఎస్ నాయకుడు మనోజ్ గౌడ్
నవతెలంగాణ సుల్తానాబాద్ రూరల్
రోడ్డు ప్రమాదంలో యువకులు తీవ్రంగా గాయపడిన ఘటన సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. మండలం లొని కాట్నపల్లీ గ్రామ ఇటుక బట్టిల వద్ద లారీ, బైక్ డీకొనగా ఇద్దరు యువకులు రేగడి మద్దికుంట కి చెందిన కుర్ర రాము, నర్సాపూర్ కి  చెందిన యాదగిరి రాజు (వాన్ డ్రైవర్లు) తీవ్ర గాయాల పాలయ్యారు. యాక్సిడెంట్ విషయం తెలుసుకున్న  టిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తక్షణమే ప్రమాద స్థలానికి చేరుకొని గాయపడిన వారిని తక్షణం మే అంబులెన్స్ పిలిచి కరీంనగర్ కి చికిత్స నిమిత్తం తరలించిన అనంతరం వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం మనోజ్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలు ఎవరు ఇండ్ల నుండి బయటకు రాకూడదని సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సి వస్తే జాగ్రత్తగా వాహనాన్ని నడుపుతూ వెళ్లాలని  ప్రయాణికులకు సూచించారు.
Spread the love