బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పరామర్శ

నవతెలంగాణ-రామగిరి 
రామగిరి మండలంలోని ఆదివారం పేట గ్రామానిక చెందిన మైదం రామయ్య సతీమణి కమల(లక్ష్మి) అనారోగ్యంతో కరీంనగర్లోని మెడికవర్ హాస్పిటల్ చికిత్స పొందుతుండగా ఆమెను మంథని ఎమ్మెల్యే మాజీమంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి  తెలుసుకొని వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆయన వెంట మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ రామగిరి మండల బీసీ సెల్ అధ్యక్షుడు బండారి సదానందం ఉన్నారు.
Spread the love