పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి వినయ్ రెడ్డి రాజీనామా..

నవతెలంగాణ – ఆర్మూర్  
బిజెపి పార్టీ ప్రాథమిక సబుత్వానికి నియోజకవర్గ నాయకులు పొద్దుటూరు వినయ్ రెడ్డి రాజీనామా చేశారు ఈ మేరకు సోమవారం రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి పంపిన రాజీనామా లేఖను అందజేసినారు. ఈ రాజీనామా లేఖను భారమైన మనసుతో తీవ్ర నిరాశతో, అంతర్గత గ్రూపు రాజకీయాలతో విసిగిపోయి నియోజక వర్గంలో పార్టీని ముందరకు నడిపించే భాధ్యతను మోయలేక ఈ రాజీనామాను మీ ముందర ఉంచుతున్నాను. నా ఈ రాజీనామాను తక్షణమే అమలు చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఆర్మూర్ ప్రాంతంలో జన్మించిన నేను ఆర్మూర్ గడ్డమీద ఆర్మూర్ కి చెందిన నాయకుడే ఎమ్మెల్యేగా ఉండాలని, మన ప్రాంతం వారు ఎమ్మెల్యేగా ఉంటే మన ప్రాంత అభివృద్ధి జరుగుతుందని 2016లో క్రియాశీల రాజకీయాలకు రావడం జరిగింది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడిన నన్ను కొంతమంది రాష్ట్ర మరియు జిల్లా బిజెపి నాయకులు కలిసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. వారి ఆహ్వానం మెరకు ఎన్నికల సమయంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నాను. నేను పార్టీలో చేరే సమయానికి ఎన్నికలకు కేవలం ఒక నెల సమయం మాత్రమే ఉంది. ఈ నెల వ్యవధిలో ప్రతి ఊరు. ప్రతి పల్లె తిరిగి సుమారుగా 20వేల ఓట్లు సాధించడం జరిగింది. ఇది రాష్ట్రంలోనే 18వ స్థానం. ఈ ఓటు శాతం గతంలో బిజెపి ఆర్మూర్ లో ఎన్నడూ సాధించలేదు. మూడవ స్థానం వచ్చినప్పటికీ ఎక్కడ నిరుత్సాహపడకుండా ఎన్నికలు అయినా మరుసటి రోజు నుండి యథావిధిగా పార్టీ మరియు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ కార్యకర్తలు, నాయకుల సహాయ సహకారాలతో తెలంగాణలో ఎక్కడ లేని విధంగా నియోజకవర్గ వ్యాప్తంగా 14 ఎంపిటిసి స్థానాలు, ఒక జడ్పిటిసి స్థానాన్ని, సర్పంచ్ – ఉప సర్పంచ్లను మరియు 6 కౌన్సిర్లలను గెలిపించుకోవడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ అధైర్య పడకుండా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారి గెలుపునకు కాలికి గజ్జ కట్టుకొని ప్రచారం చేసి ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సహాయ సహకారాలతో రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుండి 32వేల అత్యధిక మెజారిటీని ఇచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవిత గారిని ఓడించడంలో వ్యవహరించి అరవింద్ గారికి దేశవ్యాప్తంగా గుర్తింపు తేవడంలో నా పాత్ర కీలకమైనది.అలాగే 2020 జిహెచ్ఎంసి ఎన్నికల్లో భాగంగా జీడిమెట్ల డివిజన్లో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ నుంచి ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్నాడని తెలుసుకొని బీజేపీ జిల్లా నాయకత్వం ఆ ఎన్నికల్లో నాకు బాధ్యతలు ఇవ్వకుండా రాష్ట్ర నాయకత్వాన్ని సంప్రదించి ఆ డివిజన్ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఈ బాధ్యతలు తీసుకున్న అనంతరం ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుగుతున్న నాపై స్థానిక ఎమ్మెల్యే కెపి వివేకానంద ప్రత్యక్షంగా భౌతిక దాడికి దిగినప్పటికీ వెనుక వేయకుండా బిజెపి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకోవడం జరిగింది. అలాంటి నాపై ధర్మపురి అరవింద్ లక్ష్యంగా చేసుకొని కావాలనే నన్ను పార్టీకి దూరం చేసేందుకు కుట్రలు చేస్తూ, కించపరచడం,పార్టీ అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానం ఇవ్వకపోవడం, ప్రోటోకాల్ పాటించకపోవడం, నన్ను అభిమానించే నాయకులను, కార్యకర్తలను, మండల అధ్యక్షులను ఎవరిని నాతో తిరగవద్దని, కలవవద్దని ఎంపీ గారు మరియు ఆయన తొత్తులు భయానికి గురి చేసే కుట్రలు పన్నారు. ఒక రాజకీయ పార్టీ గానీ, నాయకుడు గానీ ఎదగాలంటే స్వేచ్ఛ అవసరం. అలాంటి స్వేచ్ఛ ప్రస్తుతం అరవింద్ గారి రూపంలో కనుమరు కావడం, నాపై ఆయన కుట్రపూరితంగా సామాజిక మాధ్యమాలు అసత్య ఆరోపణలతో కూడిన వీడియోలు సృష్టించడం నన్ను మరింత అసహనానికి గురిచేసింది. పార్టీలో అంతర్గత గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ రోజుకో కొత్త నాయకున్ని ఆర్మూర్ బిజెపి అభ్యర్థి అంటూ కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నాడు. నమ్మిన పార్టీ మరియు నమ్మిన నాయకుడే నాకు సహకారం అందించకపోవడం తో తీవ్ర అసహనానికి లోనయ్యాను. తెలంగాణ బిజెపికి ఉనికి తెచ్చిన నాయకులు శ్రీ బండి సంజయ్ కుమార్ . అనుక్షణం బిఆర్ఎస్ పై పోరాటం చేస్తున్న నాయకుడిని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి హఠాత్తుగా తీసివేయడంతో బిఆర్ఎస్ – బిజెపి రెండు ఒకటేనని సగటు కార్యకర్తకు స్పష్టమైనది. మరోవైపు ఈ నియోజకవర్గంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్న నాతో సంప్రదింపులు జరపకుండా, కార్యవర్గ సమావేశం నిర్వహించకుండా మండల అధ్యక్షులను మార్చడం జరిగింది. గత సంవత్సరం ప్రధాని మోదీ గారి హైదరాబాద్ సభలో పాల్గొన్న అనంతరం నియోజకవర్గ కార్యకర్తలకు నేను స్వయంగా భోజన ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా నందిపేట్ కార్యకర్తలను తీసుకువచ్చిన నందిపేట్ మండల అధ్యక్షులైన ఎలిగేటి రాజు గారిని కేవలం నేను ఏర్పాటు చేసిన భోజనం తిన్నందుకు కుట్రపూరితంగా వారిని పార్టీ అధ్యక్ష పదవి నుండి తొలగించారు.అలాగే మాక్లూర్ మండల అధ్యక్షులైన కాలగడ్డ వినోద్ గారు మరియు ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు అయిన జెస్సు అనిల్ కుమార్ న్యాయబద్ధంగా మద్దతుగా ఉంటున్నారని వారిని అకారణంగా అధ్యక్ష పదవిని తొలగించి అవమానపరిచారు. పార్టీకి నిస్వార్థంగా సేవ చేసిన నాయకులను తొలగించి ఒకప్పుడు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన నాయకులను మరియు ఎంపీ అరవింద్ కు తొత్తులుగా వ్యవహరిస్తున్న వారిని మాత్రమే నూతన మండల అధ్యక్షులుగా నియమించారు. ఇలాంటి ఘటనలు గత 2-3 సంవత్సరాల నుండి ఎన్ని ఎదురైనా భరిస్తూ పార్టీకి నిస్వార్థంగా సేవ చేశాను. మీరు అర్థం చేసుకుంటారని భావిస్తూ నా ప్రాథమిక సభ్యత్వానికి మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. నా యొక్క రాజీనామాను వీలైనంత త్వరగా అంగీకరించవలసిందిగా ఆయన తెలిపారు..
Spread the love