నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్-17లో భాగంగా హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. కోహ్లీ (51), పాటిదార్ (50) అర్ధశతకాలు చేశారు. డుప్లెసిస్ (25), గ్రీన్ (37*) కీలక ఇన్నింగ్స్ ఆడారు. జాక్స్ (6), మహిపాల్ (7), దినేశ్ కార్తీక్ (11) పెద్దగా రాణించలేదు. చివర్లో వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ స్వప్నిల్ (12; 5 బంతుల్లో 1×4, 1×6) ఆకట్టుకున్నాడు. బౌలర్లలో ఉనద్కత్ 3, వికెట్లు పడగొట్టగా.. నటరాజన్ 2, కమిన్స్, మయాంక్ చెరో వికెట్ తీశారు.