కేంద్ర సంక్షేమ పథకాల విస్తృత ప్రచారం

నవతెలంగాణ – గోవిందరావుపేట
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాలుగా అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలపై స్థానిక బిజెపి నాయకులు శనివారం విస్తృత ప్రచారం నిర్వహించారు.మండలం లోని పస్రా గ్రామంలో బూత్ నెంబర్ 74 లో బూత్ అధ్యక్షుడు మద్దినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు మద్దినేని తేజ రాజు పాల్గొని, భారత ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిది సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటా ప్రచారంలో భాగంగా నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో అధికార పార్టీ వల్ల ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో అధిక భాగం కేంద్రమే బరిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో సోమల్లు, వీరబోయిన సతీష్, బొంతల రాజు, కేశ సతీష్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love