– కర్నాటక మంత్రి ప్రియాంక ఖర్గే
బెంగళూరు : పాఠ్యపుస్తకాల్లో మార్పులతో సహా గత బీజేపీ ప్రభుత్వం తీసుకున్న అన్ని తిరోగమన నిర్ణయాలను సమీక్షిస్తామని కర్నాటకలో నూతనంగా కొలువుతీరిన కాంగ్రెస్ మంత్రి ప్రియాంక ఖర్గే బుధవారం తెలిపారు. మత మార్పిడి నిరోధక చట్టం, గో హత్య నిరోధక చట్టంతో సహా బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అన్ని చట్టాలను కాంగ్రెస్ సమీక్షిస్తుందని చెప్పారు. కర్నాటకలో హిజాబ్ వివాదంపై కూడా మంత్రి స్పందించారు. హిజాబ్ సమస్యను చట్టపరంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక శ్రేయస్సు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని మంత్రి చెప్పారు.