డాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావ్, ఆయేషాఖాన్ జంటగా మణీంద్రన్ దర్శకత్వంలో డా|| లివింగ్స్టన్ నిర్మిస్తున్న రొమాంటిక్ మాస్, యాక్షన్, లవ్ ఎంటర్టైనర్ ‘గుట్టు చప్పుడు’. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్ర టీజర్ను తాజాగా హీరో సాయి దుర్గా తేజ్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ప్రసాద్ల్యాబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నటులు బ్రహ్మాజీ టీజర్ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘మా అబ్బాయి నటిస్తున్న 3వ సినిమా ఇది. మంచి నిర్మాత, టెక్నీషియన్స్ను కుదిరారు. భారీ బడ్జెట్తో తీశారు. దర్శకుడు కూడా తీసిన కంటెంట్ను మళ్లీ చెక్ చేసుకుంటూ జాగ్రత్తగా ఈ సినిమా చేశారు. ఈ టీజర్ చూసిన తర్వాత సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఏర్పడిరది’ అని తెలిపారు.
‘డైరెక్టర్ మణీంద్రన్ కథ చెప్పినప్పుడు ఎగ్జైట్గా ఫీలయ్యా. ఇదొక ప్రేమ, యాక్షన్, రొమాంటిక్తో పాటు మంచి మెసేజ్తో కూడిన సినిమా. హీరో సంజరు రెండు రకాల షేడ్స్ను అద్భుతంగా చేశారు. టీజర్లో మీరు చూసింది కొద్దిగానే. సినిమాలో ఇంకా మంచి స్టఫ్ ఉంది. క్లైమాక్స్ ఫైట్ను దాదాపు 75 లక్షల రూపాయలతో జహీరాబాద్ షుగర్ ఫ్యాక్టరీలో తీశాం’ అని నిర్మాత లివింగ్స్టన్ చెప్పారు.
సంగీత దర్శకుడు గౌర హరి మాట్లాడుతూ,’ సంగీతానికి మంచి స్కోప్ ఉండేలా దర్శకుడు కథను రాసుకోవడం నాకు బాగా ప్లస్ అయ్యింది’ అని అన్నారు.
దర్శకుడు మణీంద్రన్ మాట్లాడుతూ,’నిర్మాత సహకారం వల్లే సినిమా ఇంత గ్రాండ్గా వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి సంగీతం ఈ సినిమాకు హైలెట్. ప్రేక్షకులు పెట్టిన డబ్బుకు మించిన ఆనందాన్ని ఇచ్చే సినిమా ఇది’ అని తెలిపారు. ‘ఇది నాకు 3వ సినిమా. ఇది నాకు మంచి టర్నింగ్ పాయింట్ ఇచ్చే సినిమా. అందరినీ ఆకట్టుకునే అన్ని అంశాలూ ఇందులో ఉన్నాయి. మా అందరికీ సూపర్ సక్సెస్ ఇచ్చే సినిమా ఇది’ అని హీరో సంజరురావు అన్నారు.