అత్యంత విజయవంతమైన హార్రర్ కామెడీ సిరీస్ ‘అరణ్మనై’ నుంచి సుందర్. సి, తమన్నా భాటియా, రాశీ ఖన్నా నటించిన ‘అరణ్మనై 4’ మే 3న థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగులో ‘బాక్’ అనే టైటిల్తో వస్తున్న ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహించారు. గ్రాండ్గా జరిగిన ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్లో మేకర్స్ ‘బాక్’ ట్రైలర్ను లాంచ్ చేశారు. హీరోయిన్ రాశి ఖన్నా మాట్లాడుతూ,’డైరెక్టర్ సుందర్ సి ఈ సినిమాకి బ్యాక్ బోన్. ఆయన చాలా క్లియర్ విజన్తో సినిమా చేశారు. నాకు హర్రర్ సినిమాలు చాలా ఇష్టం. కానీ అవి తీయడం ఎంత కష్టమో ఈ సినిమా సమయంలో తెలిసింది. చాలా అద్భుతమైన టెక్నికల్ టీంతో ఈ సినిమా చేశాం. మ్యూజిక్ వండర్ ఫుల్గా ఉంటుంది. ఈసారి ‘బాక్’కి గ్లామర్ పెరిగింది. తమన్నా ఇప్పటివరకూ చేయని ఓ కొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే పాట వైరల్ అవుతుంది. ఇందులో హర్రర్ గ్లామర్, థ్రిల్, కామెడీ అన్నీ ఉన్నాయి. కోవై సరళతో వర్క్ చేయడం మంచి అనుభూతి. బాక్ మే 3న వస్తోంది. ఇది పర్ఫెక్ట్ సమ్మర్ ట్రీట్. ఫ్యామిలీతో కలసి చూడాలి. ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు ఎంజారు చేసే సినిమా ఇది. తెలుగులో విడుదల చేస్తున్న సురేష్ ప్రొడక్షన్కి ధన్యవాదాలు’ తెలిపారు.