చనిపోయిన శవం సాక్షిగా ఆస్తి గొడవలు

– తల్వార్, కట్టెలతో ఒకరిపై ఒకరు దాడులు
 నవతెలంగాణ- రామారెడ్డి
చనిపోయిన శవం ఇంట్లో ఉండగానే ఒకరిపై ఒకరు తల్వార్, కట్టెలతో దాడి చేసుకున్న ఘటన మండలంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. మండలంలోని ఇస్సన్నపల్లి గ్రామానికి చెందిన చింతల కిష్టవ్వ (55) అనారోగ్యంతో మృతిచెందగా, భర్త గతంలో చనిపోగా, పిల్లలు లేరు. మరిది మైసయ్య, భార్య, పిల్లలు ఆస్తి కోసం గొడవపడి, రూ 2లక్షలు ఇస్తేనే శివ దహన సంస్కారం చేయనిస్తామని అనటంతో, మృతురాలు, బంధువుల ఇరు వర్గాల మధ్య తోపులాటతో ప్రారంభమైన గొడవ, కట్టెలతో కొట్టుకోవడం, చింతల రవి ఇంట్లో నుండి తల్వార్ తో మృతురాలు చెల్లెలు కొడుకు అప్పర బోయిన నర్సింలు రాజంపేట మండలం ఎల్లారెడ్డిపల్లి వాసిపై చంపటానికి రాగా, గురి తప్పి నర్సింలు ఎడమచేతు 3 వేలు తెగడంతో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా, అదనపు పోలీసు బలగాలను మోహరించి ఎస్సై విజయ్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారు. సంఘటన స్థలాన్ని సిఐ రామన్ పరిశీలించారు.
Spread the love