ఇండిగో విమానంలో మహిళకు గుండె పోటు…కాపాడిన తోటి ప్రయాణికుడు

నవతెలంగాణ – ఢిల్లీ
ఇండిగో విమానంలో గుండెపోటు బారినపడ్డ ఓ మహిళకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఓ వైద్యుడు ఆమెకు సీపీఆర్ చేసి ప్రాణాపాయాన్ని తప్పించారు. ఇండిగో 6సీ 869 విమానం శుక్రవారం బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరింది. మార్గమధ్యంలో విమానంలోని రోసమ్మ(60) అనే ప్రయాణికురాలికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో విలవిల్లాడియపోయింది. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన ఓ డాక్టర్ వెంటనే రంగంలోకి దిగారు. ఆమెకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. విమానం ఢిల్లీలో లాండ్ అవగానే సిబ్బంది మహిళను ఆసుపత్రికి తరలించారు. తోటి ప్రయాణికుడు తక్షణం స్పందించడంతో మహిళకు ప్రాణాపాయం తప్పిందని ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది.

Spread the love