మండల సర్వసభ్య సమావేశం వాయిదా ..

– సర్వసభ్య సమావేశానికి హాజరైన ఒకే ఒక ప్రజా ప్రతినిధి

– ప్రజా ప్రతినిధులు రాకపోవడంతో మండల సర్వసభ్య సమావేశం వాయిదా
నవతెలంగాణ – ఇల్లందకుంట
ఇల్లంతకుంట మండలం సర్వసభ్య సమావేశం మండల ఎంపీపీ సరిగోమ్ముల పావని వెంకటేష్ మండల ఎంపీడీవో జే. పుల్లయ్య ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఇల్లందకుంట మండల ఎంపిటిసిల కో ఆప్షన్ నెంబర్ ఒకరు మాత్రమే హాజరయ్యారు. ఎంపిటిసిలు ఎవరు హాజరు కాకపోవడంతో  సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎంపీపీ సరిగోమ్ముల పావని వెంకటేష్ తెలిపారు. మండల ప్రభుత్వ అధికారులు 21 అధికారులు ఉండగా దాని 16 శాఖలకు  సంబంధించిన అధికారులు మాత్రమే హాజరయ్యారు.
Spread the love