నాగసముద్రాల ఆశా కార్యకర్త అనారోగ్యంతో మృతి

– సంతాపం వ్యక్తం చేసిన సర్పంచ్‌, గ్రామస్థులు
నవతెలంగాణ-కోహెడ
మండలంలోని నాగసముద్రాల గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త బట్టు కమల (52) అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. మృతురాలికి భర్త, ముగ్గురు కూతురులు, ఒక బాబు ఉన్నారు. కుమారుడు మానసిక వికలాంగుడు కావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోనేవారని గ్రామస్థులు తెలిపారు. 18 సంవత్సరాలుగా గ్రామంలో వైద్యసేవలందించి మంచి పేరు సంపాదించుకుందని సర్పంచ్‌ తైదల రవీందర్‌, గ్రామస్థులు తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆశా కార్యకర్త కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్‌ కోరారు. ఎంపీటీసీ కొమురవ్వ రాజు, డాక్టర్‌ నిమ్రాతరుణమ్‌, ఏఎన్‌ఎంలు, మండలంలోని ఆశా కార్యకర్తలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది, గ్రామస్థులు అంతిమ వీడ్కోలు కార్యక్రమంలో పాల్గోని సంతాపం వ్యక్తం చేశారు.

Spread the love