బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించేందుకు బూత్ కమిటీ సభ్యులు సన్నద్ధం కావాలి 

– హుస్నాబాద్ ఎంపీపీ లకావత్ మానస 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు బూత్ కమిటీ సభ్యులు సన్నద్ధం కావాలని హుస్నాబాద్ ఎంపీపీ లకావత మానస అన్నారు. గురువారం హుస్నాబాద్ మండలంలోని జిల్లెలగడ్డ, వంగరామయ్యపల్లి, మిర్జాపూర్, బల్లునాయక్ తండ, పోతారం గ్రామాలలో బూత్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. బూత్ కమిటీ సభ్యులకు పార్టీ కండువలు, కరపత్రాలను అందిస్తూ ప్రచారానికి సన్నద్ధం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ బీఆర్ఎస్ అధ్యక్షులు గంగం మధుమోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అనుమల ప్రభాకర్ రెడ్డి , పోతారం ఎంపిటిసి బొమ్మ గాని శ్రీనివాస్ , టిఆర్ఎస్ మాజీ అధ్యక్షులు వంగ వెంకటరామిరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్, రవి, జిల్లెల్లగడ్డ మాజీ సర్పంచులు లావడ్యా స్వరూప, లావుడియా తిరుపతి , కొండల్, పొన్నబోయిన శ్రీనివాస్, పెసర శీను, లతా,  రాజు , బాలు, రమేష్ ,శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love