సుహాస్ హీరోగా నూతన దర్శకుడు శ్రీధర్రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘కేబుల్ రెడ్డి’. ఫ్యాన్ మేడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై బాలు వల్లు, ఫణి ఆచార్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో షాలిని కొండేపూడి హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శుక్రవారం పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా లాంచ్ చేశారు. శ్రీధర్ రెడ్డి(దర్శకుడు) కెమెరా స్విచాన్ చేయగా, మరో దర్శకుడు శైలేష్ కొలను క్లాప్ కొట్టి స్క్రిప్ట్ని మేకర్స్కి అందించారు.ఈ సందర్భంగా హీరో సుహాస్ మాట్లాడుతూ,’ దర్శకుడు శ్రీధర్ మంచి స్నేహతుడు. తనకి ఇది తొలి చిత్రం. రెండు రోజుల్లో చిత్రీకరణ స్టార్ట్ అవుతుంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ఇది’ అని తెలిపారు. ‘ఇది నా మొదటి సినిమా. చాలా ఆసక్తికర మైన కథ రాసుకున్నాను. అంతే ఆసక్తికరంగా, యంగేజింగ్గా షూటింగ్ చేయడానికి సన్నాహాలు చేశాం. ఒక టౌన్లో జరిగే కథ ఇది. క్లీన్ ఎంటర్ టైనర్గా ఉంటుంది’ అని దర్శకుడు శ్రీధర్ రెడ్డి అన్నారు. నాయిక షాలిని కొండేపూడి మాట్లాడుతూ,’ చాలా మంచి టీంతో ఈ సినిమా చేస్తున్నాం. మంచి కథ. ఇలాంటి మంచి చిత్రంలో నటించే ఛాన్స్ ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు’ అని చెప్పారు. ‘ఇది మా మొదటి సినిమా. బౌండెడ్ స్క్రిప్ట్తో షూట్కి వెళ్తున్నాం. మొదటి షెడ్యూల్ను 20 రోజుల్లో పూర్తి చేస్తున్నాం’ అని నిర్మాతల్లో ఒకరైన బాలు వల్లు తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: మహి రెడ్డి పండుగల, సంగీతం: స్మరణ్ సాయి, ఆర్ట్ డైరెక్టర్: క్రాంతి ప్రియం.