నవతెలంగాణ హైదరాబాద్: నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి మానుకోటకు రానున్నారు. మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ నామినేషన్ కార్యక్రమానికి హజరుకానున్న ఆయన సాయంత్రం నాలుగు గంటలకు స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో జరగనున్న జన జాతర సభలో పాల్గొననున్నారు.
సీఎం రానుండటంతో అధికారులు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యవేక్షిస్తున్నారు.