కాంగ్రెస్‌ పటిష్టతకు కృషి చేయాలి..

– కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్
– కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు సమావేశంలో వెల్లడి
నవతెలంగాణ- తాడ్వాయి : కాంగ్రెస్‌ పార్టీ పటిష్టతకు కార్యకర్తలు కృషి చేయాలని డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పిలుపు మేరకు గ్రామాల్లో కమిటీల అధ్యక్షులను ఈనెల 17 వరకు ఎన్నుకోవాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యంగా పని చేయాలన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలం, బలగం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ కోఆర్డినేటర్ మార్గ విజయ్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకన్న, పిఎసిఎస్ చైర్మన్ పులి సంపత్ గౌడ్, మాజీ మండల అధ్యక్షుడు జాలపు అనంతరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు లచ్చు పటేల్, తాడ్వాయి సర్పంచ్ ఇరుప సునీల్ దొర, మహిళ కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పోలిబోయిన సృజన, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు రేగ కళ్యాణి, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు సర్పంచులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love